ఆచార్య దినోత్సవ శుభాకాంక్షలు

సనాతన ధర్మాచరణలో ముఖ్యమయినది కర్మానుష్టానము.

ఈ కర్మానుష్టానమునకు ఉపకరణము దశేంద్రియ మనోబుద్ధ్యహంకారచిత్తమైన భౌతికకాయము.

దీనికి సంస్కరణపరులు మాతాపితృలు, ఆచార్యులు, బంధువులు, సన్నిహితులు, అతిథులు.

వీరంతా సదా మాననీయులు.

🙏🙏

తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్లు

మాతృ దేవోభవ పితృ దేవోభవ
ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ

భౌతిక ప్రపంచ జ్ఞానమందించిన వారందరూ ఆచార్యులే. అట్టి ఆచార్యులందరూ కూడా ముమ్మాటికీ దేవతా మూర్తులే.

అట్టి ఆచార్యులని గౌరవించటమే ధర్మనిరతి.

🙏🙏

ఇక ఆత్మ జ్ఞానమందించు గురువు త్రిమూర్తి స్వరూపుడైన సాక్షాత్ పరబ్రహ్మమే.

గురు బ్రహ్మ గురు విష్ణుః
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ

🙏🙏

ఇది మన సనాతన సంస్కృతి.

ధర్మో రక్షతి రక్షితః👌

Leave a comment

Create a website or blog at WordPress.com

Up ↑