సనాతన ధర్మాచరణలో ముఖ్యమయినది కర్మానుష్టానము.
ఈ కర్మానుష్టానమునకు ఉపకరణము దశేంద్రియ మనోబుద్ధ్యహంకారచిత్తమైన భౌతికకాయము.
దీనికి సంస్కరణపరులు మాతాపితృలు, ఆచార్యులు, బంధువులు, సన్నిహితులు, అతిథులు.
వీరంతా సదా మాననీయులు.
🙏🙏
తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పినట్లు
మాతృ దేవోభవ పితృ దేవోభవ
ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ
భౌతిక ప్రపంచ జ్ఞానమందించిన వారందరూ ఆచార్యులే. అట్టి ఆచార్యులందరూ కూడా ముమ్మాటికీ దేవతా మూర్తులే.
అట్టి ఆచార్యులని గౌరవించటమే ధర్మనిరతి.
🙏🙏
ఇక ఆత్మ జ్ఞానమందించు గురువు త్రిమూర్తి స్వరూపుడైన సాక్షాత్ పరబ్రహ్మమే.
గురు బ్రహ్మ గురు విష్ణుః
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
🙏🙏
ఇది మన సనాతన సంస్కృతి.
ధర్మో రక్షతి రక్షితః👌
Leave a Reply